ప్రియాంక గాంధీ తనయుడి ఫొటోగ్రఫీ సరదా... తాజాగా తీసిన పులి ఫొటో వైరల్

  • ఇటీవలే రణథంబోర్ పార్క్ ను సందర్శించిన రైహాన్
  • విశ్రమించిన పులిని ఫొటో తీసిన వైనం
  • నేరుగా కెమెరా వైపే చూసిన పులి
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా గురించి ఇప్పటివరకు తెలిసింది చాలా తక్కువ. అయితే ఒక్క ఫొటోతో రైహాన్ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫొటోగ్రఫీ పట్ల ఎంతో మక్కువ చూపే ప్రియాంక తనయుడు ఇటీవలే ఓ పులిని ఫొటో తీశాడు.

రాజస్థాన్ లోని సుప్రసిద్ధ రణథంబోర్ నేషనల్ పార్క్ ను సందర్శించిన రైహాన్ అక్కడ చెట్ల నీడలో విశ్రమిస్తున్న పులిని తన కెమెరాలో బంధించాడు. ఆ పులి ఓ కంటితో తనవైపే చూస్తున్న దృశ్యాన్ని రైహాన్ అత్యంత ఒడుపుగా క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.

ప్రియాంక గాంధీ తనయుడ్ని చాలామంది మొదటిసారి చూడడం ఒకెత్తయితే, అతడు తీసిన ఫొటో మరో ఎత్తు. మొత్తమ్మీద నెటిజన్ల దృష్టిలో రైహాన్ రాజీవ్ వాద్రా ఓ వైల్డ్ ఫొటోగ్రాఫర్ గుర్తింపు అందుకుంటున్నాడు.


Raihan Rajiv Vadra
Tiger
Photo
Ranathambore National Park
Rajasthan

More Telugu News